విశాలాంధ్ర తనకల్లు పాదయాత్రలో ఇచ్చిన హామీలను తీర్చి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా 18వ రోజు కళ్లకు గంతలు కట్టుకొని సిఐటియు ఆధ్వర్యంలో 150 మంది హెల్పర్లు టీచర్లు కలిసి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేసి మినీ వర్కర్స్ ను మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలన్నారు ఎఫ్. ఆర్. ఎస్. ఎఫ్. రద్దుచేసి పని భారం తగ్గించాలన్నారు హెల్పర్స్ ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలు పెంచాలని సర్వీస్ లో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 2017 నుండి టీఏ బిల్లులు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు తీర్చే వరకు సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు ఆగవని మున్ముందు మరింత ఉద్ధృతం చేస్తామని సిఐటియు నాయకులు శివన్న వేమనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సంఘం జయమ్మ నాగలక్ష్మి మంజుల తదితరులు పాల్గొన్నారు