విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణములోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు 9600 విలువచేసే ఇత్తడి పూజా సామాగ్రిని ముదుగుబ్బ మండలం ఎనుములవారిపల్లి గ్రామానికి చెందినటువంటి బెస్త హరి సతీమణి విజయలక్ష్మి తో సహకారంతో ధర్మవరం బెస్త శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇత్తడి పూజా సామాగ్రిని అర్చకులు సుదర్శన ఆచార్యులు, సునీల్ కుమారాచార్యులు లకు అందజేశారు. అనంతరం అర్చకులు దాతల పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇటువంటి పూజా సామాగ్రి ఆలయమునకు సమర్పించడం ఎంతో శుభదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెస్త నారాయణస్వామి, బెస్త నడిపి వెంకటరాముడు, రామకృష్ణమ్మ, గంగమ్మ, సుశీలమ్మ ,చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.