తిమ్మమ్మ మర్రిమాను ను సందర్శించిన భక్తులు
విశాలాంధ్ర,ఎన్ పి కుంట: మండలంలోని పలు ఆలయాలలో సోమవారం నూతన సంవత్సరమును పురస్కరించుకొని భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద నున్న తిమ్మమాంబ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శివాలయము, నల్ల గంగమ్మ ఆలయం, అయ్యప్ప స్వామి గుడి, వైకుంఠ నారాయణస్వామి గుడి, గోవిందరాజులపల్లిలో ఇరగలమ్మ ఆలయం, ధనియాన్ చెరువులో భైరవేశ్వర స్వామి ఆలయం, జౌకలలో గంగమ్మ ఆలయం, తూర్పు నడిమిపల్లిలో చౌడేశ్వరి దేవి ఆలయం, చీమలచెరువు పల్లెలో చింతల గంగమ్మ ఆలయం, రెడ్డివారిపల్లెలో సీతారాముల గుడి, ఎర్ర వంకల వారి పల్లి లో శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ గుడి ఆలయాలలో భక్తులు తెల్లవారుజామున నుంచి అమ్మవారిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిమ్మమ్మ మర్రిమాను వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎర్పాట్లు చేశారు. భక్తులందరికీ ఉచిత అన్నదాన ప్రసాదం కల్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.