బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి జగన్ నేరుగా నందినగర్లో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో జగన్కు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకున్నారు. కేసీఆర్ నివాసం వద్ద జగన్కు మాజీ మంత్రి కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. స్వయంగా కేటీఆర్ జగన్ను తీసుకుని లోపలికి వెళ్లారు. అయితే కేసీఆర్ను జగన్ మర్యాదపూర్వకంగానే కలిశారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. వారి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయి అన్నది తెలియాల్సి ఉంది.