విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణంలోని కళాజ్యోతిలో ఈనెల ఏడవ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కళాజ్యోతి వారి సౌజన్యంతో శ్రీమద్భగవద్గీత క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు శ్రీ గీత భక్త మండలి సభ్యులు దేవత వెంకట నాగరాజు, దేవతా కృష్ణమూర్తి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ క్విజ్ పోటీలు పాల్గొనే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు. మొత్తము 10 ప్రశ్నలను అడగడం జరుగుతుందని, అన్ని కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారికి ప్రోత్సాహక నగదు బహుమతులు ఉంటాయని తెలిపారు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఒక నిమిషం మాత్రమే ఉంటుందని తెలిపారు. తుది తీర్పు నిర్వాహకుల దేనని తెలిపారు. ఆసక్తిగల తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క పేర్లను నమోదు చేసుకొనుటకు సెల్ నెంబర్ 94405 06071 లేదా 81006233427 లేదా 9849568166 కు సంప్రదించాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.