ఇద్దరు విద్యార్థుల మృతి
మరో ఐదుగురికి గాయాలు
పెర్రీ: అమెరికా మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. అయోవా రాష్ట్రం, డాలస్ కౌంటీలోని పెర్రి నగరంలోని హైస్కూల్లో ఓ 17ఏళ్ల విద్యార్థి బీభత్సం సృష్టించాడు. ఆరవ తరగతి విద్యార్థిని కాల్చి చంపాడు. మరో ఐదుగురిని గాయపర్చాడు. శీతాకాల సెలవుల తర్వాత తరగతులు మొదలు కాగా అదే స్కూలు విద్యార్థి రెచ్చిపోయాడు. గాయపడిన వారిలో స్కూలు ప్రిన్సిపల్ డాన్ మార్బర్గర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన విద్యార్థిని డైలన్ బట్లర్ (17)గా గుర్తించామన్నారు. అతను తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తంచేశారు.
అయితే అతను కాల్పులు ఎందుకు జరిపాడో తెలియలేదు. బట్లర్ నిశ్శబ్దంగా ఉండేవాడని, చాలా ఏళ్లుగా వేధింపులకు గురవుతున్నాడని అతని ఇద్దరు స్నేహితులు, వారి తల్లి తెలిపారు. బట్లర్ వద్ద పంప్`యాక్షన్ షాట్గన్, స్మాల్ క్యాలిబర్ హ్యాండ్గన్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ దాడి వెనుక ఉద్దేశాన్ని కనిపెట్టేందుకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులనూ పరిశీలిస్తున్నట్లు వెల్లడిరచారు. కాల్పుల ఘటనకు ముందు స్కూల్లోని టాయిలెట్లో ఉన్న తన ఫొటోను టిక్టాక్లో బట్లర్ పెట్టాడని, దానికి స్ట్రే బుల్లెట్ పాటతోపాటు ‘నౌ వి వెయిట్’ అనే క్యాప్షన్ జోడిరచినట్లు తెలిపారు. బట్లర్ ఇద్దరు సోదరీమణులు, వారి తల్లి మాట్లాడుతూ చిన్నతనం నుంచి బట్లన్ను అంతా ఏడ్పించేవారని చెప్పారు. అందువల్లే ఈ దారుణానికి పాల్పడివుంటాడని చెప్పారు.