విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : చోడవరంలో ప్రభుత్వ హై స్కూల్ వెనుకన గల విశ్రాంత ఎం.డి.ఒ. కొండల రావు ఇంటికి వున్న ఇనుప కిటికీ కి ఉరి వేసుకొని ఓ యువకుడు మృతి చెందడం సంచలనం రేపింది. మృతుడుది బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన పత్తి ప్రశాంత్ 24 గా గుర్టించారు. తండ్రి అప్పలనాయుడు, తల్లి పార్వతమ్మ. రాత్రి 11 గంటలకు తల్లికి ఫోన్ చేసినట్లు బంధువులు చెప్తున్నారు. అతనిని ఎవరైనా హత్య చేశారా, లేక ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే వివరాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. చోడవరం సిఐ బి.శ్రీనివాసరావు, ఎస్.ఐ. లు తమ సిబ్బందితో వెళ్లి విచారణ చేస్తున్నారు. మృతునికి అంకుపాలెంలోనూ వడ్డాదిలోనూ బంధువులు ఉన్నారని తెలిసింది. మృతదేహాన్ని పరిశీలించిన సీఐ శ్రీనివాసరావు, క్లూస్ టీంను రంగంలోకి దించారు.