విశాలాంధ్ర- చోడవరం (అనకాపల్లి జిల్లా) : రాష్ట్ర తూర్పు కాపు సంఘం ఉత్తర్వులు మేరకు అనకాపల్లి జిల్లా తూర్పు కాపు సంఘం అధ్యక్షులు, న్యాయవాది కరణం శ్రీహరి గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో చోడవరం మండలానికి సంబంధించి సామాజిక సేవ కార్యకర్తగా పేరుగాంచిన పుల్లేటి గణేష్ ని తూర్పు కాపు సంఘం చోడవరం మండల అధ్యక్షునిగా నియామకం చేస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. తూర్పు కాపుకు సంబంధించి కార్యక్రమాలు చోడవరం మండలంలో ఇక మీదట గణేష్ అధ్యక్షతన జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు సంఘం ఉపాధ్యక్షులు నానాజీ గారు, శేషగిరి రావు గారు, చోడవరం మండలంలో గల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు నాయకులు ఎర్రం శెట్టి చిన్న, నానబెల్లి శ్రీను, పుల్లేటి వెంకటేష్,గూటాల సతీష్,గోకాడ శ్రీను ,పెద్ద ఎత్తున కాపు యువత పాల్గొన్నారు.