అనకాపల్లి జిల్లాకు చెందిన బహుభాషా బాల నృత్య కళాకారులకు టర్కీ డాన్స్ డిప్లమాలు లభించాయని స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ ఆర్ .జానకి పేర్కొన్నారు. ఇస్తాంబుల్ కు చెందిన బోగా జికి ఫోక్లర్ బిర్లిజి సాంస్కృతిక సంస్థ ప్రతి ఏడాది అంతర్జాతీయ స్థాయి ఆన్లైన్ డాన్స్ కాంపిటీషన్లను నిర్వహిస్తున్నది. “గో టు ఫెస్టివల్ “”పేరిట నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ఆన్లైన్ పోటీలలో అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి బహుభాషా నృత్య కళాకారులు కొండ్రెడ్డి నేహా అక్షయ అత్యధిక మార్కులతో గ్రాండ్ ఫిక్స్ డిప్లొమాను అందుకోగా, జూనియర్స్ విభాగంలో మాన్యా సంఘవి, డి. లక్ష్మీ స్నేహితలు ప్రత్యేక డిప్లమాలను అందుకున్నారు. సబ్ జూనియర్స్ విభాగంలో అత్యధిక మార్కులతో జనిత్ సంఘవి గ్రాండ్ ఫిక్స్ Dప్లమాను అందుకొని అంతర్జాతీయ స్థాయి అభినందనలు అందుకున్నాడు. వీరంతా విశాఖకు చెందిన స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్ దగ్గర బహుభాషా నృత్యాల్లో శిక్షణ పొందుతున్నారు .గతంలో థాయిలాండ్ ,ఇండోనేషియా, న్యూఢిల్లీ ,సింగపూర్ వంటి ప్రాంతాల్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఫోక్ డాన్స్ ఫెస్టివల్స్ లో భారత బృందం తరపున పాల్గొని పలు అవార్డులు అందుకున్నారు .ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ బాలల ప్రతిభ సాంస్కృతిక, విజ్ఞాన పోటీలలో కూడా జినీత్ సంఘవి, మాన్యా సంఘవి , నేహా అక్షయ, లక్ష్మీ స్నేహిత లు పాల్గొని జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చారు. విశ్వవ్యాప్తంగా సుమారు 35 దేశాలు పాల్గొన్న ఈ Tourkey Dance పోటీలలో రిపీట్ ఎర్ర టన్ ,జమీరా సేటిన్ లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.