ఒకరి అరెస్టు… రూ. 2.95 లక్షల విలువ చేసే 6,912 కర్నాటక టెట్రా పాకెట్లు, లగేజీ వాహనం స్వాధీనం
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లాలో సెబ్ పోలీసులు కర్నాటకమద్యంపై ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు సెబ్ అదనపు ఎస్పీ జి.రామకృష్ణ పర్యవేక్షణలో సెబ్ విభాగం స్పెషల్ టీం సి.ఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం వేకువజామున కుందిర్పి మండలం మహంతిపురం శివార్లలో పక్కా రాబడిన సమాచారంతో దాడులు నిర్వహించారు. కర్నాటక రాష్ట్రం లింగదహాళ్ మద్యం దుకాణం నుండీ కుందిర్పి మండలం మందలపల్లికి టాటా సుప్రో లగేజీ వాహనంలో 72 బాక్సుల కర్నాటక టెట్రా పాకెట్లు తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. మహంతిపురం ఓబుళేసును అరెస్టు చేశారు. ఇందులో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు. లింగదహాళ్ నుండీ మందలపల్లికి తరలించి ఇక్కడి నుండీ పరిసర గ్రామాలకు అక్రమంగా విక్రయిస్తున్నటాలు విచారణలో వెల్లడైంది.