విశాలాంధ్ర-రాంబిల్లి(అనకాపల్లి జిల్లా) : రాంబిల్లి మండలం తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో 33వ రోజు అంగన్వాడీల ఆందోళన కొనసాగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి దేముడు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న న్యాయ పోరాటానికి అన్ని తరగతుల ప్రజల మద్దతు వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరించి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచకపోవడం అన్యాయం అన్నారు. ఇప్పటికీ ఆరుదపాలుగా రాష్ట్ర నాయకత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిలు జరిపిన కనీస వేతనాలు పెంచకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ కన్నా అదనంగా జీతాలు పెంచుతామని మాటిచ్చిన ముఖ్యమంత్రి, అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి పట్టుదల మానుకొని కనీస వేతనం పెంచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు సుజాత, నూకరత్నం, సావిత్రి, లక్ష్మీ,సంతోషి, అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.