విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం టౌన్, రూరల్, బత్తలపల్లి తాడిమర్రి ముదిగుబ్బ మండలాలలో ఈనెల 12వ తేదీ నాటికి 2,39,557 మంది ఓటర్లు కలరని తహసిల్దార్ యుగేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం నియోజకవర్గంలో పురుషులు 1,19,086, స్త్రీలు 1,20,451, ఇతరులు 20 మంది కలలని తెలిపారు. అదేవిధంగా ధర్మవరం అర్బన్ లో పురుషులు 51,002 మంది, స్త్రీలు 52,212 మంది, ఇతరులు 15 వెరసి 1,03,229, ధర్మవరం రూరల్ లో పురుషులు 17,081 మంది, స్త్రీలు 17,034 మంది, ఇతరులు 01, వెరసి 34,116 మంది ఉన్నారన్నరు. అదేవిధంగా బత్తలపల్లి మండలంలో పురుషులు 16,059 మంది, స్త్రీలు 15,298 మంది ఇతరులు 04 వెరసి 32,361 మంది, తదుపరి ముదిగుబ్బ మండలంలో పురుషులు 22,893 మంది, స్త్రీలు 23,083 మంది, ఇతరులు జీరో, వె రసి 45,976, అదేవిధంగా తాడిమర్రి మండలంలో పురుషులు 12,051 మంది, స్త్రీలు 11,824 మంది ఇతరులు జీరో, వెర సి 23,875 మంది కలరని తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో పురుషులు 1,19,086 మంది, స్త్రీలు 1,20,451, ఇతరులు 20 వెరసి 2,39,557 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.