ఎంపీపీ అనూష దేవి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలంలోని తెలుగు ప్రజలందరూ మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలను ఆనందోత్సాహాల మధ్య సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని సంతోషంగా ఉందని ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ తెలుగు ప్రజలు పెద్ద పండుగగా చెప్పుకునే పతంగుల పండుగ మకర సంక్రాంతి. భోగి పండుగ తో ప్రారంభమై కనుమ, ముక్కనుమతో ముగిసే నాలుగు రోజుల ఈ పర్వదినం ప్రతి ఇంట భోగభాగ్యాలు, సుఖశాంతులతో తులతూగాలని, గిరి రైతుల ఇంట వ్యవసాయ సిరులు పొందాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజలందరికి ఆమె మకర సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.