పట్టుదల చిత్తశుద్ధి ఉంటే ఉన్నత పదవులు తలుపు తడతాయి
ఉద్యమాల గడ్డ.,.. కుటాగుళ్ల బిడ్డ
సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర, కదిరి.చిత్తశుద్ధి, పట్టుదల, ఉద్యమ స్ఫూర్తే తనను ఇంతటి వాడిని చేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి మీసాల వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. తన జన్మదిన సందర్బంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యమాల పురిటి గడ్డ విప్లవ నాయకుడు కామ్రేడ్ రావూఫ్ పుట్టిన కుటాగుళ్ల గ్రామంలో
1995-96లో విద్యార్ధి ఉద్యమాల వైపు మగ్గు చూపి ఏఐఎస్ఎఫ్ విద్యార్ధి సంఘంలో చేరి విద్యార్థులకు అండగా నిలిచి అనేక ఉద్యమాలు చేపట్టిన సమయంలో తనపై అనేక కేసులు నమోదు చేసినప్పటికి భయపడకుండా చిత్తశుద్ధితో పని చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ హోదాల్లో ఉద్యమ నాయకుని గా పలువురి అభినందనలు పొందానని తెలిపారు.2000లో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిగా
2004లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసానన్నారు
2005లో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి 3000 కిమీ సైకిల్ జాత ఏర్పాటు చేసి తనదైన ముద్ర వేసుకొన్నారు.2008 నుండి 2010 వరకు ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా పని చేసినట్లు తెలిపారు.2010 నుండి కదిరి సీపీఐ నియోజకవర్గ కార్యదర్శిగా పని చేస్తూ 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేశారు.జిల్లాల విభజనలో భాగంగా శ్రీ సత్య సాయి (పుట్టపర్తి)జిల్లా ఏర్పాటు చెయ్యడంతో నీతి నిజాయితీ పట్టుదల చిత్తశుద్ధి అన్ని కలిసి రావడంతో (24.04.2023) జిల్లాకు తొలి సీపీఐ జిల్లా కార్యదర్శిగా తన ఉన్నతికి తోడ్పాటు అందించాయని వేమయ్య యాదవ్ పేర్కొన్నారు.తన జన్మదిన సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.