విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) ప్రతి ఆర్టీసీ ఉద్యోగి విధి నిర్వహణలో ఏకాగ్రత ఎంతో అవసరమని వన్ టూ సీఐ సుబ్రహ్మణ్యం,సిఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ సత్యనారాయణ అధ్యక్షతన రోడ్డు భద్రత మాసోస్తవాలను సిఐలు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం సిఐలు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉంటూ, మెలుకువలను, రోడ్డు నియమా నిబంధనలను పాటించినప్పుడే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని తెలిపారు. ప్రమాద రహిత డిపోగా ధర్మవరమును తీసుకొని రావాలని వారు తెలిపారు. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని అందించి, ప్రజల మన్ననలు పొందడంతో పాటు ధర్మవరం డిపోను అగ్రగామిగా నిలపాలని తెలిపారు. రోడ్డు నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నచోట అతి నెమ్మదిగా వెళ్లేందుకు చర్యలు కూడా చేపట్టాలని తెలిపారు. అతివేగం అమిత ప్రమాదమని, ప్రాణాలు కూడా కోల్పోయి పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని డ్రైవర్లు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, నియమ నిబంధనలను గూర్చి వారు వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇంచార్జ్ వెంకటేష్, ఆఫీసు సూపర్డెంట్ ప్రేమ్ కుమార్, ఏ ఈ. సికిందర్, టిఐలు- శ్రీరాములు,జిపి రెడ్డి, కార్యాలయ సిబ్బంది యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో ఆర్టిసి ఉద్యోగులు పాల్గొన్నారు.