విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా): తే.20.01.2024ది. చోడవరం కొత్తూరు జంక్షన్ రాంబాబు కాంప్లెక్స్ ఆవరణలో గల శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ దుకాణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా కాలి బూడిద అయినట్లు చోడవరం ఫైర్ స్టేషన్ అధికారి బి.వి. రామస్వామి తెలిపారు. రాత్రి దుకాణం మూసివేసిన తర్వాత తెల్లవారి సాయి లక్ష్మీ ఎలక్ట్రానిక్స్ దుకాణం నుండి పొగలు వస్తుండడంతో స్థానికులు చోడవరం ఫైర్ స్టేషన్కు సమాచారం అందజేశారు దీంతో స్టేషన్ అధికారి రామస్వామి సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు పది లక్షలకు పైగా టీవీలు తదితర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయినట్లుగా అగ్నిమాపక అధికారి తెలిపారు.