విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో కురుబ సోదరులు ఏర్పాటు చేయనున్న శ్రీ భక్త కనకదాససు విగ్రహానికి మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి 50 వేల రూపాయల నగదును విరాళంగా బుధవారం గ్రామ నాయకులు వీరేష్ గౌడ్ ఆధ్వర్యంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ పెద్దలకు అందజేశారు. మంత్రాలయం నియోజకవర్గంలో కురువ, కురుబ సోదరులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ, చంద్ర, బద్రి, బ్రహ్మయ్య, కురువ నాగప్ప, లక్ష్మయ్య, సీతప్ప, నర్సింహులు, తిక్కయ్య, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.