గవర్నర్ చే మెమొంటో అందుకున్న భాస్కర్
ఫోటో గవర్నర్ మెమొంటో అందుకున్న విఆర్వో భాస్కర్
విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం వీఆర్వో ఎంవిఎన్ భాస్కర్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ బూత్ స్థాయి అధికారిగా ( బి ఎల్ ఓ పిఎస్.09 ఏ.గోకవరం) ఎంపికయ్యారు. గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు జరిగిన రాష్ట్ర స్థాయి 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతులమీదుగా భాస్కర్ మోమెంటో, సర్టిఫికేట్, రూ.10,000 నగదు బహుమతి అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ బూత్ స్థాయి అధికారిగా మెమొంటో అందుకున్న భాస్కర్ ను తాహసిల్దార్ ఏవి రమణారావు, డిప్యూటీ తహసిల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్, డీటీలు పోతురాజు, సాయి రమేష్, మండలంలో విఆర్వోలు, ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జడ్పిటిసి సభ్యురాలు కోరిపల్లి జయలక్ష్మి, మండల సచివాలయ కన్వీనర్ డాక్టర్ పెనుగొండ బాలకృష్ణ, మండల వైసీపీ కన్వీనర్ మరడ వెంకట మంగారావు, మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు పుత్సకాయల విష్ణుమూర్తి, ఉంగుటూరు మండల ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు, అక్కుపల్లి గోకవరం గ్రామ సర్పంచి మిద్దె సత్యవతి వెంకటేశ్వరరావు, గ్రామస్తులు భాస్కరను అభినందించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ బూత్ భాస్కర్ మాట్లాడుతూ అందరు సహకారంతో నాకు గవర్నర్ చేతుల మీదుగా మెమొంటు అందుకున్నాను అన్నారు.