విశాలాంధ్ర,కదిరి : భవిష్యత్తు టిడిపి దేనని టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో వైసీపీ వీడి టీడీపీలోకి తాలూకా పరిధిలోని సదుం గ్రామానికి చెందిన సిద్దిక్, బాబా, బషీర్, షంషీర్,వేపరాల గ్రామానికి చెందిన రఘునాథ రెడ్డి, పాపిరెడ్డి రమణారెడ్డి, కొండయ్య, నిజాంవలి కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్ జిలానితో పాటు పలువురు టిడిపి యువ నాయకులు వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ నేటి నుండి ఒక సైనికుల పనిచెయ్యడానికి కృషి చెయ్యాలని తనకు మద్దతు ఇస్తున్న నాయకులకు కార్యకర్తలకు కందికుంట కృతజ్ఞతలు తెలియజేశారు.