విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా నుంచి స్టేట్ యోగ కాంపిటీషన్లో ఎంపిక కావడంతోపాటు నేషనల్ యోగాకు కూడా ఎంపిక కావడం జరిగిందని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల రమేష్ రెడ్డి, కార్యదర్శి సుబ్బారాయుడు, ఆర్గనైజర్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో దిండిగల్లులో జరిగే కేల్ ఇండియా నేషనల్ యోగ కాంపిటీషన్ కార్యక్రమం ఈనెల 27, 28వ తేదీలలో జరుగుతుందని, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ముదిగుబ్బ గ్రామములో నలుగురు బాలికలు, లేపాక్షి కస్తూరిబా స్కూలు నుంచి నలుగురు బాలికలు, కనగానపల్లి కస్తూరిబా స్కూల్ , మోడల్ స్కూల్ నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఏడు మంది బాలికలు నేషనల్ స్థాయికి ఎంపిక శుభ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భోజనపు ప్యాకెట్లను బిస్కెట్లను ఆ యోగా విద్యార్థులకు అందజేశారు.