విశాలాంధ్ర పామిడి : ఇంటింటా తిరిగి తప్పులు లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలని బీఎల్వోలకు ఎన్నికల అధికారులు ఎన్నిసార్లు ఆదేసించినా మార్పు కనిపించడం లేదు, పామిడి మండల పరిధిలోని 253 పోలింగ్ బూత్ లో 52 మంది మృతుల ఓట్లు ఉన్నా తొలగించలేదు. ఓటరు మీద డిలీట్ అని రాసి వదిలేశారు రాజకీయ పార్టీ నాయకులు గుర్తించి పలుసార్లు బీఎల్వోలకు ఫిర్యాదు చేసినా అలాగే ఉంచారు, డబుల్ ఎంట్రీలు అలాగే ఉన్నాయి, మరోవైపు జాబితాలను రెవెన్యూ కార్యాలయాల వద్ద అందుబాటులో లేకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు,ఓటరు జాబితా సవరణలో అధికారులు మాయాజాలం ప్రదర్శించారు స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఓటర్ జాబితా మాయాజాలం ప్రదర్శించిన అధికారిపై చర్యలు వార్డులోని ప్రజలు కోరుతున్నారు