విశాలాంధ్ర ,భీమిలి : గణతంత్ర దినోత్సవం లో భాగంగా ఉత్తమ పంచాయతీగా అవార్డు తీసుకున్న ఛాయా గౌతమి చంద్రశేఖర్ భీమిలి మండలం టీ నగరపాలెం శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో పంచాయతీకి అవార్డు వచ్చినందున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. పంచాయతీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినందు వల్ల ఈరోజు ఈ అవార్డు పంచాయతీ దక్కిందని వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పల్ల నీలిమ సన్యాసిరావు, వైస్ ప్రెసిడెంట్ గారి బంగార్రాజు, వార్డ్ మెంబర్ సూరిబాబు, మాజీ ఎంపీటీసీ అప్పలనరసయ్య తదితరులు పాల్గొన్నారు.