విశాలాంధ్ర-రాప్తాడు : మాజీ మంత్రి పరిటాల సునీత నేటి నుంచి నియోజకవర్గంలో పలుచోట్ల వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బుధవారం నగరంలోని మాజీ మంత్రి నివాసంలో నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ పటిష్టత గెలుపు కోసం ప్రతి కార్యకర్త రోజు ప్రజల్లో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నేడు రాచానపల్లి, బిఎన్ఆర్ కాలనీ, ఎస్సీ కాలనీ, దోబీ కాలనీ, పరిటాల రవీంద్ర కాలనీలలో భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమం ఉంటుందన్నారు. 2వ తేది ఆర్.ఎన్.ఆర్
కాలనీ, రామకృష్ణపురం, సిండికేట్ నగర్ లోని కొన్ని కాలనీలు, 5, 6 తేదీల్లో సిండికేట్ నగర్ లో వరుసగా భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 3వ తేది ఉదయం ఆత్మకూరు మండలం, మధ్యాహ్నం రాప్తాడు మండల కేంద్రాల్లో, 4వతేది ఉదయం చెన్నేకొత్తపల్లి, మధ్యాహ్నం అనంతపురం రూరల్ పరిధిలో జయహో బీసీ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నికలకు ఇక ఎంతో సమయం లేదని.. టీడీపీ శ్రేణులు కలిసికట్టుగా దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి రోజు, ప్రతి గంట చాలా ముఖ్యమైనదని.. ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని.. అలాగే రాప్తాడులో టీడీపీ జెండా ఎగరాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.