విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): – రాబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివిధ శాఖల అధికారులను బదిలీలు చేస్తున్న క్రమంలో ఇప్పటికే చింతపల్లి ఎంపీడీవో ఆశాజ్యోతిని బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా తహశీల్దార్ లను బదిలీ చేస్తుంది. ఇందులో భాగంగా చింతపల్లి తహశీల్దార్ పీ లత్షా పాత్రుడు ని బదిలీ చేసింది. ఆయనను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చింతపల్లి తహశీల్దార్ గా ఆయన బాధ్యతలు చేపట్టి సుమారు ఆరు నెలలు మాత్రమే అయింది. తక్కువ కాలం పని చేసినప్పటికీ చింతపల్లి మండలంలో ఆయన చిత్తశుద్ధితో విధులు నిర్వహించారు.