విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా): చింతపల్లి ఎంపీడీవో గా వి వీర సాయిబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా విధులు నిర్వర్తించిన వీర సాయిబాబు చింతపల్లి ఎంపీడీవో గా బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను స్థానిక మండల పరిషత్ ఏఓ రవీంద్ర, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ జాన్, సిబ్బంది పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీపీ, జడ్పిటిసి, సర్పంచులు, ఎంపిటిసిలు అన్ని శాఖల ఉద్యోగులతో సమన్వయంతో విధులు నిర్వహిస్తానని, ప్రతి ఒక్కరూ తనకు విధులలో సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఎంపీడీవో గా పనిచేసిన ఆశాజ్యోతి కాకినాడ జిల్లా పెద్దపూడి బదిలీపై వెళ్లిన విషయం పాఠకులకు తెలిసింది. ఈ క్రమంలో ఖాళీ అయిన స్థానంలో వీర సాయిబాబు ఎంపీడీవో గా గురువారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.