నిరుపేదలకు దుస్తులు వితరణగా అందించిన చేయూత వారియర్స్ ట్రస్ట్
ట్రస్ట్ చైర్మన్ రమణ
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలంలోని బెన్నవరం పంచాయతీ రేగళ్ళు, గొచ్చపల్లి గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయడం జరిగిందని చేయూత వారియర్స్ ట్రస్ట్ చైర్మన్ దూనబోయిన రమణ అన్నారు. నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు సహాయం చేయడమే తమకు తృప్తినిస్తుందన్నారు. రానున్న కాలంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు అందిస్తే మరిన్ని సేవ కార్యక్రమాలు చేయడానికి చేయూత వారియర్స్ ట్రస్ట్ ముందుంటుందని ఈ సందర్బంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు బొజ్జన్న దొర, రమణమ్మ దంపతులు, ట్రస్ట్ సభ్యులు కిముడు బిలాస్కర్, సాగిన జగన్ పంతులు, కటారీ సత్యనారాయణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.