విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పలు ఆలయాలను తిరుమల తిరుపతి టిటిడి పర్యవేక్షణ అధికారి ఢిల్లీ రెడ్డి ధర్మవరం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆలయ నిర్మాణం కొరకు, ఆర్థిక సహాయము కొరకు దరఖాస్తు చేసుకున్న పట్టణంలోని సిద్దయ్యగొట్టలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆలయ అధ్యక్షురాలు జయశ్రీ తో పాటు ఆలయ నిర్మాణ పనులను వారు పర్యవేక్షించారు. అదేవిధంగా దేవాలయాల యొక్క రిజిస్ట్రేషన్ వివరాలు, స్థలము యొక్క వివరాలు, కావలసిన నిధులు గురించి వారు పూర్తి దశలో సమీకరించారు. ఢిల్లీ రెడ్డితోపాటు పురాణ పండిట్ గజ్జల వేణుగోపాల్ కూడా హాజరై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా చెన్నై కొత్తపల్లి మండలం ఆమిదాలకుంట గ్రామంలో గల సీతారాముల గుడికి భజన మందిరం నిర్మాణం కొరకు నాగమణి దరఖాస్తు చేసుకున్న విధంగా దేవాలయాన్ని కూడా వారు పరిశీలించి రిజిస్ట్రేషన్ స్థలం యొక్క వివరాలను తెలుసుకున్నారు. తదుపరి ఢిల్లీ రెడ్డి మాట్లాడుతూ ఈ రెండు ఆలయాలపై సమగ్ర నివేదికను తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పించి, తద్వారా నిధులను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మాచార్యులు నక్కల వెంకటేశులు