. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తాం
. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
రాంచీ : లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేశ వ్యాప్తంగా కుల గణన చేపడతామని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గిరిజనుడు కావడంతో జార్ఖండ్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ ప్రభుత్వాన్ని కూల్చేం దుకు బీజేపీ ప్రయత్నించిందని విమర్శించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కుట్రను అడ్డుకుని పేదల ప్రభుత్వాన్ని కాపాడినందుకు (చంపై) సోరెన్ జీ కూటమి ఎమ్మెల్యేలందరినీ అభినందించాలనుకుం టున్నాను’ అని గాంధీ అన్నారు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా ఇక్కడ షహీద్ మైదాన్లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) బానిస కార్మికులుగా మార్చారని, పెద్ద కంపెనీలు, ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలలు, కోర్టుల్లో వారి భాగస్వామ్యం కొరవడిరదని రాహుల్ అన్నారు. ‘ఇది భారతదేశం ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న. దేశంలో కుల గణనను చేపట్టడం మా మొదటి అడుగు’ అని తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వలేమని పేర్కొన్న గాంధీ, భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (ఇండియా) ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తుందని హామీ ఇచ్చారు. ‘దళితులు, ఆదివాసీల రిజర్వేషన్లలో ఎలాంటి తగ్గింపు ఉండదు. సమాజంలోని వెనుకబడిన వర్గాల వారి హక్కులను పొందుతారని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇది అతిపెద్ద సమస్య సామాజిక, ఆర్థిక అన్యాయం’ అని గాంధీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తాను ఓబీసీ అని చెప్పుకునేవారని, అయితే కులాల గణన కోసం డిమాండ్ వచ్చినప్పుడు ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని తెలిపారని అన్నారు. ‘బీసీలు, దళితులు, గిరిజనులకు హక్కులు కల్పించాల్సిన సమయం వచ్చినప్పుడు కులాలు లేవని మోదీజీ అంటున్నారని, ఓట్లు రాబట్టే సమయం వచ్చినప్పుడు తాను ఓబీసీ అని అంటున్నారని గాంధీ విమర్శించారు. జార్ఖండ్ అసెంబ్లీలో చంపై సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షలో గెలిచిన వెంటనే బీజేపీపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ… గిరిజన సీఎంను అంగీకరించలేనందున ప్రభుత్వాన్ని తొలగించాలని బీజేపీ ప్రయత్నించిం దన్నారు. కాంగ్రెస్, జేఎంఎం కలిసి వారికి వ్యతిరేకంగా నిల్చొవడం ద్వారా ప్రభుత్వం రక్షించబడిరదన్నారు. వారు దర్యాప్తు సంస్థలు, డబ్బు బలం ద్వారా అన్ని ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రాలలో దీన్ని చేస్తారని ఆరోపించారు. ‘వారు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. ప్రజల గొంతును అణచివేయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేయడానికి ‘ఇండియా’ కూటమి అనుమతించదు’ అని కాంగ్రెస్ నాయకుడు ర్యాలీలో నొక్కి చెప్పారు. తన ‘క్రోనీ క్యాపిటలిస్ట్ స్నేహితులకు’ ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు)ను ప్రైవేటీకరించే ప్రయత్నమని మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం పీఎస్యూలను నెమ్మదిగా చంపేస్తున్నాయి. హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ లిమిటెడ్) పనిచేయకూడదని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. రాబోయే రోజుల్లో హెచ్ఈసీ పేరును అదానీ నేమ్ప్లేట్తో మారుస్తారని అన్నారు. ‘వారు దానిని ప్రైవేటీకరించాలనుకుంటున్నారు. నేను ఎక్కడికి వెళ్లినా పీఎస్యూల కార్మికులు, ఉద్యోగులు తమ చేతుల్లో పోస్టర్లతో నిలబడటం నేను చూస్తున్నాను. అది బీహెచ్ఇఎల్, హెచ్ఎఎల్ లేదా హెచ్ఈసీ కావచ్చు. నెమ్మదిగా అదానీకి అప్పగిస్తున్నారు’ అని గాంధీ ఆరోపించారు. అలాంటి ప్రైవేటీకరణను కాంగ్రెస్ అనుమతించదని ఆయన తేల్చిచెప్పారు. ‘మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి. అదానీ పేరును హెచ్ఈసీలో ఉంచనివ్వము. అదానీకి ఈ ఉచిత బహుమతిని ఇవ్వడానికి మేము అనుమతించమని బీజేపీ వారికి చెబుతున్నాను’ అని అన్నారు. అదానీకి లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం అన్ని పీఎస్యూలను తొక్కిపెడుతోందని, ఈ ప్రైవేటీకరణ దళితులు, ఓబీసీలు, గిరిజనులు, మైనారిటీలు, పేద సాధారణ కులాల నుంచి ‘దోచుకునే’ ప్రయత్నమని ఆయన విమర్శించారు. మరికొద్ది నెలల్లో దళితులు, ఓబీసీలు, గిరిజనులు, మైనారిటీలు, సాధారణ కులాల పేదలు తమ సంఖ్యను తెలుసుకుంటారని గాంధీ చెప్పారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న 90 మంది కార్యదర్శులలో ముగ్గురు మాత్రమే ఓబీసీ కేటగిరీకి చెందిన వారని అన్నారు. దేశంలో ‘భారీ’ నిరుద్యోగం ఉందని, నోట్ల రద్దు కారణంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ‘నాశనమయ్యాయని’ గాంధీ తెలిపారు. ‘నల్లధనానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను’ అని ప్రధాని మోదీ అబద్ధం చెప్పారని, ఆపై నోట్ల రద్దు, జీఎస్టీని అమలు చేశారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ యువత ఉద్యోగాలు పొందలేరని కాంగ్రెస్ నేత అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ వివిధ మతాలు, భాషలకు చెందిన ప్రజలు గొడవపడేలా చేశారని ఆరోపించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ ద్వేషం, హింసకు వ్యతిరేకంగా తాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ భారత్ జోడో యాత్ర చేశానని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చెప్పారు. ఆ యాత్రలో లక్షలాది మంది కలిసి నడిచి కొత్త బాటను చూపారన్నారు.