. ఒకరిపై చర్య తీసుకుంటే తప్ప చక్కబడేలా లేదు
. పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సోమవారం హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. టీడీపీ శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణలో భాగంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీ సులు అరెస్టు చేస్తారని ఎంపీలు, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది. ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాలి. అలా వివరణ తీసు కోకుండా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారు? అని హైకోర్టు ప్రశ్నిం చింది. అలా చేస్తే బాధ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేట్లు లేదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై వివరాల సమర్పణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరగా, తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది.
అవినాష్రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ వాయిదా
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడిరది. ఏప్రిల్ మూడో వారంలో కేసు తుది వాదనలు వింటామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం వెల్లడిరచింది. ఏప్రిల్ 22కి ముందు కేసు విచా రణకు తీసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. ఈలోపు కేసు డైరీ మొత్తాన్ని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించగా, అది 60 భాగాలుగా ఉందని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే వాటిని డిజిటల్ రూపంలోకి మార్చి ఈ-డైరీ సమర్పించాలని ఆదేశించింది. అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు విషయం తెలిసిందే.