లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి దినేష్
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వాతావరణ మార్పుల వలన సోకే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి దినేష్ అన్నారు. ఆ పి హెచ్ సి పరిధిలోని కొమ్మంగి పంచాయతీ ఉరిసింగి గ్రామంలో గురువారం ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామం తో పాటు సమీప గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతానికి భిన్నంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని, మునుపెన్నడూ లేని విధంగా మన్యంలో వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన్యంలో కాచి చల్లార్చిన నీటిని త్రాగడమే గాక, పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆ పి హెచ్ సి వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.