విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్రస్థాయిలో చిలకలూరిపేటలో ఈనెల 10 11 వ తేదీలలో జరిగిన చెకుముకి టాలెంట్ పరీక్షల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం లోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ పురపాలక బాలుగా ఉన్నత పాఠశాల విద్యార్థులు జోగేష్ కుమార్ ఓబులేష్ ఈశ్వర్ రెండవ ర్యాంకును సాధించి బహుమతులను అందుకోవడం జరిగిందని పాఠశాల హెచ్ఎం రాంప్రసాద్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ఆన్లైన్లో జరిగిన ఈఈఎంటి పరీక్షల్లో పదవ తరగతి విభాగంలో చారు గుండ్ల తులసి కార్తీక్ రెండవ ర్యాంకును సాధించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా మా పాఠశాల పదవ తరగతి పరీక్షలలోనూ ఇతర పోటీ పరీక్షలలోను క్రీడారంగములోనూ రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి లలో ముందంజలో ఉన్నామని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ, తోటి విద్యార్థులు, బోధనేతర సిబ్బంది ఆ విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.