రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 11వ తేదీన ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరంలో ఆపరేషన్కు ఎంపికైన 65 మందిని బెంగళూరు శంకర హాస్పిటల్ కు ఉచిత బస్సు ద్వారా పంపడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహా, కార్యదర్శి నాగభూషణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్యులచే వైద్య చికిత్సలు అందుకున్న వైద్యుల యొక్క స్లిప్పులు, రోగులకు కావలసిన బట్టలు వగైరా అన్నీ కూడా బస్సులో అమర్చి పంపడం జరిగిందని తెలిపారు. ఉచిత ప్రయాణంతోపాటు, భోజన ప్యాకెట్లు అందించడం జరిగిందని, ఆపరేషన్ అనంతరం తిరిగి ఉచితంగా బస్సుల్లో తీసుకొని రావడం జరుగుతుందని తెలిపారు. తదుపరి ఆపరేషన్ పూర్తి చేసుకున్న వారికి కూడా ఉచితంగా అద్దాలను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు బోనాల శివయ్య, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.