ఏకగ్రీవమైనట్లు 20న అధికారిక ప్రకటన
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు వైసీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినట్టు రిటర్నింగ్ అధికారి విజయరాజు తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన మూడు సీట్లకు వైసీపీ తరపున గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఆ నామినేషన్లను అధికారులు శుక్రవారం పరిశీలించారు. అన్నీ సక్రమంగా ఉండటంతో ఆమోదించారు. అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం సీఈఓ ముకేశ్ కుమార్ మీనా, ఆయా అభ్యర్థుల తరపున హాజరైన ప్రతినిధుల సమక్షంలో పూర్తైందని విజయరాజు తెలిపారు. అనంతరం వారి నామినేషన్లు ఆమోదిస్తున్నట్టు వెల్లడిరచారు. స్వతంత్ర అభ్యర్థిగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు నామినేషన్కు కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన పత్రం లేకపోవడంతో తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 20వ తేదీ వరకూ గడువు ఉంది. ఆ రోజున ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.