విశాలాంధ్ర అనంతపురం వైద్యం ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశించారు.
సీఎం బందోబస్తు విధులకు విచ్చేసిన పోలీసు అధికారులతో ఎస్పీ గారు ఈరోజు రాప్తాడు పోలీసు స్టేషన్ సమీపంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు.
హెలీప్యాడ్, సభా స్థలి, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్, తదితర విధులలో ఎమి చేయాలో ఏమి చేయకూడదో పలు సూచనలు చేశారు
సీఎం జిల్లా పర్యటన ప్రశాంతంగా ముగిసేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈసమావేశంలో అనంతపురం, కడప, చిత్తూరు, నంద్యాల జిల్లాల అదనపు ఎస్పీలు ఆర్ విజయభాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, ఎస్ లక్ష్మినారాయణరెడ్డి, కృష్ణారావు, నాగేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, పలువురు డీఎస్పీలు, సి.ఐ లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.