శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో ఈనెల 18వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు కోశాధికారి, గౌరవ అధ్యక్షులు దాసరి వెంకటేశులు ( చిట్టి), అధ్యక్ష, కార్యదర్శులు బివి. రమణ, బండి నాగరాజు, సిరివెళ్ల రాధాకృష్ణ, మామిళ్ల అశ్వత్థ నారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలను అందించి చక్కటి ఆరోగ్యమును ప్రసాదించడమే మా శాంత కళ ఆలయ అభివృద్ధి సంఘం యొక్క లక్ష్యము అని తెలిపారు. శిబిరా దాతలుగా కీర్తిశేషులు వేల్పుల వెంకటమ్మ, కీర్తిశేషులు వేల్పుల బు సప్ప జ్ఞాపకార్థం వీరి కుమారుడు వేల్పుల వెంకటేష్ అండ్ సన్స్ వారు వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా నిష్ణాతులైన దంత వైద్యులు వివేకుల్లాయప్ప, చిన్న పిల్లల వైద్య నిపుణులు వెంకటేశ్వర్లు, డాక్టర్ సుబ్రహ్మణ్యం పూజారి, జనరల్ అండ్ లాప్రోస్కోప్ సర్జన్ డాక్టర్. సాయి స్వరూప్, గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జై దీపు నేత చే వైద్య చికిత్సలతో పాటు ఒక నెలకు సరిపడు మందులను కూడా ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యమును కాపాడుకోవాలని తెలిపారు.