కోల్కతా : జాన్సన్ అండ్ జాన్సన్, అంతర్జాతీయ మానవతా స్వచ్ఛంద సంస్థలలో అగ్రగామిగా ఉన్న లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (ఎల్సీఐఎఫ్)లు తమ సైట్ ఫర్ కిడ్స్ కార్యక్రమంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో భారతదేశంలోని 7 మిలియన్లకు పైగా పిల్లలపై ప్రభావం చూపే ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. అల్పాదాయ, వెనుకబడిన వర్గాలలోని పిల్లలకు సమగ్ర కంటి సంరక్షణ సేవలను అందించడం ద్వారా కంటి సంరక్షణ లభ్యతలో అంతరాన్ని పూడ్చేందుకు ఈ ఇరు సంస్థలూ ప్రారంభించిన కో-ఫౌండెడ్ కార్యక్రమమిది. 2024లో 500 మంది పిల్లలలో మొదటి స్క్రీనింగ్ భారతదేశంలోని కోల్కతాలో జరిగింది. దీనితో భారతదేశంలో మొత్తం విజన్ ఎసెస్మెంట్ల సంఖ్య 28 మిలియన్లకు పైగా చేరింది. ముందుగా గుర్తించడం, సంరక్షణను ప్రోత్సహించడానికి, 75,000కు పైగా ఉపాధ్యాయులకు ప్రాథమిక కంటి ఆరోగ్యంపై శిక్షణ కూడా ఇచ్చారు.