బెన్నవరం పంచాయితీలో పలు గ్రామాల్లో పర్యటించిన వైకాపా పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- జగనన్న గెలుపే రాష్ట్రాబి వృద్ధికి మలుపు అని వైకాపా పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు అన్నారు. బెన్నవరం పంచాయతీలో సోమవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా వట్టిభూసుల, గొచ్చపల్లి, జీలుగుమెట్ట, బొంకుమామిడి, రేగల్లు, కొత్త వీధి గ్రామాలలో పర్యటించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందుతున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బి కొత్తూరు నుండి బీజేపీ నుండి 13 కుటుంబాలు ఆయన సమక్షంలో వైకాపాలో చేరారు. పార్టీలో చేరిన వారిలో వండలం చిన్నాబ్బాయి, బోనంగి రమణ, బి. ప్రసాద్, కవడం హరిబాబు, వి.శివ, కొర్ర భాస్కర రావు, కోరాబు రాంబాబు, కె.కరుణ రావు, కె.చంటిబాబు, వి విజయ లక్ష్మి, కె బాలన్న, లు ఉన్నారు. వారికి వైకాపా కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలతో ఆయన మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో ప్రతి పక్షాలు ఎంత మందితో పోత్తులతో వచ్చినా సంక్షేమ పథకాలే వైకాపాకు బలమని, ప్రజలే జగనన్న కు దైర్యమనీ, జగనన్న గెలుపుతోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు సాధ్యమన్నారు.ఈ కార్య క్రమాలలో ఆ పంచాయతీ ఎంపీటీసీ గెమ్మెలి సోని, రమణ, సచివాలయ కన్వీనర్ బచ్చల బొజ్జన్న దొర, మాజీ వైస్ ఎంపీపీ భూసరి క్రిష్ణ, సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ సొలబం కర్రీ నాయుడు, సుండ్రు చిన్నాబ్బాయి, మాజీ ఎంపీటీసీ కంఠం నాయుడు, సీనియర్ నాయకులు సాగిన గంగన్న పడాల్, వైస్ సర్పంచ్ నాగేశ్వర రావు, పాలకి సింగ్రు, పాలకీ లక్ష్మణ రావు, వార్డు సభ్యులు కిముడు సత్యవతి, చినతల్లి, కొర్ర అప్పారావు, పి గోవింద్, వి కేశవ రావు, వంతల శ్రీను, మువ్వల లింగేష్, మర్రి నాధు బాబు, సిహెచ్ రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు