విశాలాంధ్ర =విజయనగరం : విజయనగరం బాబామెట్ట లో జరుగుతోన్న హాజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలీ 65వ మహా సూఫీ సుగంధ (ఉరుసు) మహోత్సవంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు జిల్లాల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ జోనల్ ఇంచార్జ్ అవనాపు విక్రమ్ , ఉమ్మడి విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన దంపతులు పాల్గొన్నారు. బుధవారం బాబామెట్టలో ఖాదర్ వలీ దర్గాకు చేరుకున్న అవనాపు దంపతులకు దర్గా మరియు దర్బార్ షరీఫ్ ముహమ్మద్ ఖలీలుల్లా గారు సాదర స్వాగతం పలికారు. ఖాదర్ బాబా దర్బార్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా యూత్ వింగ్ జోనల్ ఇంచార్జ్ అవనాపు విక్రమ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా బాబా ఉరుసు ఉత్సవంలో భక్తజనం పాల్గొనడం విశేషమన్నారు. ఎక్కడా,ఎన్నడూ జరగని విధంగా ఖాదర్ బాబా దర్గాలో నిత్యాన్నదాన క్రతువు జరగడం మహా అద్భుతమని ఆయన అభివర్ణించారు. బాబా దయతో ప్రజలంతా సుఖః సంతోషాలతో ఉండాలని అవనాపు విక్రమ్ గారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ యువజన నాయకులు మద్దిల నారాయణరావు, సంపత్ ఖాదర్, ముని ప్రవీణ్, ప్రశాంత్, ఏలుసూరి విశ్వేశ్వరరావు, దర్గా నిర్వాహాకులు, భక్తులు పాల్గొన్నారు.