జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా అండగా ఉంటామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం టౌన్ రూరల్ బత్తలపల్లి మండలాలకు సంబంధించిన బూత్ కమిటీ సభ్యులతో వారు సమావేశాన్ని నిర్వహించారు. అదేవిధంగా “నా సేన కోసం- నా వంతు” అనే కార్యక్రమంలో జనసేన పార్టీ కోసం వారు ఒక లక్ష రూపాయలను పార్టీకి విరాళంగా అందించారు. అదేవిధంగా నియోజకవర్గం మొత్తం మూడు లక్షల 6 వేల రూపాయలను జనసేన పార్టీకి విరాళంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందజేసినందులకు వారు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నా సేన కోసం నా వంతు క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, విజయవంతం చేసేలా సైనికళ్ల పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా జనసేన పార్టీ కోసం బ్యాంకు ఖాతాకు అనుసంధామైన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఫోన్ పే ద్వారా గాని, గూగుల్ పే ద్వారా గాని, పేటీఎం ల ద్వారా గాని విరాళాన్ని అందించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.