Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వాలంటీర్లే పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవాలి.. ఏపీ మంత్రి వ్యాఖ్యలపై దుమారం

ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే వాలంటీర్లే బూత్‌ ఏజెంట్లుగా పోలింగ్‌ కేంద్రాల్లో కూర్చోవాల్సి వస్తుందని బాంబ్ పేల్చారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల సంఘం కొందరు దివ్యాంగులు, వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తుందని.. వాలంటీర్లు వారికి సాయం చేయాలన్నారు. వారితో బ్యాలెట్‌ కోసం దరఖాస్తులు పెట్టించాలని.. వాలంటీర్లు చేస్తున్న సేవకు, ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఏ వృద్ధుడూ కృతజ్ఞత లేకుండా ఉండరన్నారు.ఈ ప్రభుత్వం పడిపోయిన రోజునే రాష్ట్రంలో వేలాది మంది గుండె ఆగి చనిపోతారని..మనపై కోపంగా ఉన్న కొందరు ఏదోవిధంగా వారి ఓట్లు వేయాలని చూస్తున్నారు అన్నారు. అలాంటివి కుదరదు.. అవసరమైతే బూత్‌ ఏజెంట్లుగా లోపల వాలంటీర్లే కూర్చోవాల్సి వస్తుందన్నారు. వారికి అడ్డేమీ లేదు.. వాలంటీర్ అంటే సర్వీస్‌ రూల్స్‌ ఏమీ లేవన్నారు. ఆ దిశగా తాము ఆలోచిస్తున్నామని.. ఎవరికి ఓటు వేయాలనేది వాలంటీర్లు చెప్పకపోతే ఎవరు చెబుతారన్నారు. రాజ్యాంగం అభిప్రాయం ఎవరికీ చెప్పొద్దని ఎక్కడైనా చెప్పిందా? వాలంటీర్లకే కాదు.. ఉద్యోగులకు కూడా చెప్పలేదన్నారు. ఏ ప్రభుత్వం మంచిదో ఎవరైనా చెప్పొచ్చని.. వాలంటీర్లు శక్తిమంతులుగా ఎదిగారు కాబట్టి వారు చెప్పే పార్టీకి జనం ఓటేస్తారని కొందరు బెదిరించే పని చేస్తారన్నారు. ఏ ప్రతిఫలం ఆశించని వ్యక్తులు వాలంటీర్లు‌.. ఏ వృత్తి అయినా పదిమంది గుర్తిస్తేనే సంతృప్తి లభిస్తుందన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు పాలకుడి ఆలోచనకు అనుగుణంగా పాలన ఉంటుందన్నారు. సీఎం వైఎస్‌ జగన్ వయసులో తక్కువ ఉండవచ్చు.. కానీ, పాలనపై క్లారిటీ ఉందన్నారు. చంద్రబాబుకు అవకాశం ఇస్తే ఏం చేశారన్నారు. గత టీడీపీ పాలనలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని.. కలక్టర్లే జన్మభూమి కమిటీకి వెళ్లి కలవమని చెప్పేవారన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు స్వతంత్ర సమరయోధులు కాదు.. కోపం వస్తే రేషన్ కార్డ్ తీసేసేవారన్నారు.లోకేష్ ఏం రాస్తే అది చదివేస్తున్నారని సెటైర్లు పేల్చారు. వాలంటీర్ ఎమ్మెల్యే , మంత్రి ఎవరూ వద్దన్నంత డెప్త్ గా పనిచేశారన్నారు. తెరమీద బొమ్మలు చూడకండి , రియల్ జీవితంలో మార్పు తీసుకువచ్చినవారు, రియల్ హీరో జగన్ అన్నారు. జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీల నమ్మొద్దని గతంలో చంద్రబాబు చెప్పారని.. పథకాలు ఇవ్వలేరని ప్రచారం చేశారన్నారు. కానీ వైఎస్‌ జగన్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు. పేదలు సంతోషంగా ఉండటం ఇష్టం లేని ధనవంతులే పథకాలు తీసేయాలంటున్నారన్నారు. ఓ వైపు ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశిస్తే.. మంత్రి ధర్మాన పోలింగ్ ఏజెంట్లగా కూర్చోవాలని వ్యాఖ్యానించడంపై దుమారం రేగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img