విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో “జలకవనం” (రాయలసీమ జిల్లాలో నీటి సమస్యలపై కవి సమ్మేళనం) బ్రోచర్ను సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ హరి, ధర్మవరం వర్గ కన్వీనర్ ఎం. వేణుగోపాలాచార్యులు- హిందీ టీచర్, లలితమ్మ- తెలుగు టీచర్, తులసి కుమారి- హిందీ టీచర్, ఇతర ఉపాధ్యాయులు నాగేంద్ర, శాంతి లింగం, పాఠశాల ఉపాధ్యాయులు బ్రోచర్స్ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జల కవణంలో పాల్గొనే కవులు కళాకారులు సెల్ నెంబర్:: 9491355200కు గాని 9440683009 కు సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ జల కవనం మార్చి మూడవ తేదీ పెనుకొండలోని గగన్ మహల్ లో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న కవులకు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబడును అని తెలిపారు. కవులు చదివిన కవితలతో సంకలనం తీసుకొని వస్తామని తెలిపారు. ముఖ్య అతిథులుగా సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు- కర్నూల్ కే మోహన్, ఎమ్మెల్సీ-డాక్టర్. ఎం. గేయానంద్, రాయలసీమ సాగు నీరు సాధన సమితి అధ్యక్షులు దశరథ రామిరెడ్డి, అడిషనల్ ఎస్పీ కడప సుధాకర్, జనప్రియ కవి ఏలూరి వెంకన్న- అనంతపురం, రాయలసీమ కథకులు చెట్లపల్లి చిదంబర్ రెడ్డి- హిందూపురం, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ కాలేజీ అండ్ మ్యూజియం. వి. రజిత- అనంతపురం, పెనుకొండ కళాకారులు కోగిర జయచంద్ర రెడ్డి పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా జల కవనం సమన్వయ కమిటీ ఉమ్మడి అనంతపురం జిల్లాల డాక్టర్. ఎం. ప్రగతి, ఉమ్మడి కర్నూలు జిల్లాల ఆవుల బసప్ప, ఉమ్మడి కడప జిల్లాల ప్రసాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల ఓ. రమన కూడా పాల్గొంటారని తెలిపారు. కావున ఈ జలకవనం కార్యక్రమంలో కవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.