విశాలాంధ్ర ధర్మవరం:: భర్త వేధింపులు తాళలేక భర్తనే హతమార్చిన భార్య ఉదంతం మండల పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో నెలకొన్నది. ఈ సందర్భంగా రూరల్ ఎస్సై నరేంద్ర మాట్లాడుతూ సీతారాం పల్లి గ్రామంలో భర్త విశ్వనాథరెడ్డి, భార్య ధనలక్ష్మి జీవనం కొనసాగించేవారు. భర్త తాగుడుకు బానిసై ఎన్నో రకాలుగా భార్య ధనలక్ష్మిని వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు. భార్య ధనలక్ష్మి సహనమును కోల్పోయి భర్త విశ్వనాథరెడ్డిని గొంతును టవల్తో చుట్టి, తలను బండరాతికి కొట్టింది. దీంతో అధిక రక్తస్రావం కావడంతో భర్త విశ్వనాథరెడ్డి(38) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు బంధువులు రూరల్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా, రూరల్ ఎస్సై నరేంద్ర సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన విషయాన్ని తెలుసుకొని కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. భార్య ధనలక్ష్మిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. మృతునికి 8 సంవత్సరాల భరత్ రెడ్డి,ఆరు సంవత్సరాల నరేందర్ రెడ్డి అను కుమారులు కలరు.