విశాలాంధ్ర ధర్మవరం:: రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని రక్త బంధం ఆర్గనైజేషన్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా తోటి మిత్రుల ద్వారా రక్త బంధం ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ గ్రూపులో రక్తం అవసరం ఉన్నవారికి అనుకున్న సమయంలోనే రక్తాన్ని అందించి ప్రాణాలను నిలబెట్టడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుందని వారు తెలిపారు. రక్తదానం చేయుటలో అపోహలు మానాలని, రక్తదానం చేయి దాతలు రక్తదానంపై అందరికీ అవగాహన కల్పించినప్పుడు మరింత విజయవంతం చేకూరుతుందని తెలిపారు. ఆపద సమయాలలో, గర్భిణీ స్త్రీలకు, ఆపరేషన్ సమయాలలో తదితర విషయాలలో రక్తం ఎంతో అవసరం ఉంటుందని, ఆ రక్తం వెలకట్టలేనిదని, కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మానవతా విలువలను పెంచాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పటికే మా రక్షాబంధన్ ఆర్గనైజేషన్ ద్వారా వందల సంఖ్యలో రక్తదానం మా మిత్రుల ద్వారా చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నామని, ఈ శిబిరాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ కూడా తాను ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసినట్లు వారు తెలిపారు.