శ్రీ చౌడేశ్వరీ దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్శాంత కళ శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని పల్లకి సేవలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పురవీధులలో, ఆలయ ఆవరణంలో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బివి రమణ, బండి నాగరాజు, సిరివెళ్ల రాధాకృష్ణ, మామిళ్ల అశ్వత్త నారాయణ కోశాధికారి దాసరి వెంకటేశులు (చిట్టి) మాట్లాడుతూ అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం రోజున అర్చకులచే వివిధ పూజలతో వేదమంత్రాల మంగళ వాయిద్యాలు నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ప్రతినెల ఉచిత వైద్య శిబిరంలో ఉచిత వైద్య చికిత్సలతో పాటు నెలకు సరిపడా మందులను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా ప్రతి నెల అనాధలకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు 200 రూపాయలు చొప్పున 150 మందికి దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పలు సేవా కార్యక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలతోనే ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు.