కిటుముల సర్పంచ్ రమణమ్మ
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కల్పిస్తున్న ఉపాధి పనులను ఉపయోగించుకుని ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కిటుముల సర్పంచ్ గేమ్మెల రమణమ్మ అన్నారు. ఆ పంచాయతీలోని పకాబు గ్రామంలో ఉపాధి హామీ పథకం ఏ పీ ఓ కే లక్ష్మీనారాయణ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫారం ఫండ్ పనులకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె ఏ పీ ఓ తో కలిసి చెరువు పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కార్డు కలిగిన కుటుంబం ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీవో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కార్డు కలిగిన వారికి కావలసిన పండ్లతోటలు, చెరువులు, రైతులకు ఉపయోగపడే అనేక పనులను కల్పిస్తామని, దీని వలన ప్రతి కుటుంబం ఉపాధి పొందడంతో పాటు, వలసలు నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గ్రామాలు కూడా అభివృద్ది జరిగేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు వనుము పోతురాజు, సుర్ల అప్పారావు, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ రాములు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాండురాజు, నూకాలమ్మ,, మేట్లు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.