ఎంపీటీసీ సభ్యురాలు జయలక్ష్మి
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- గడచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం గడపగడపకు సంక్షేమ పథకాలను అందించి, సంక్షేమ పాలన దిశగా అడుగులు వేసిందని ఎంపీటీసీ సభ్యురాలు చిందాడ జయలక్ష్మి అన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్ కాలనీలో వాలంటీర్లతో కలిసి ఆమె గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో ఎన్నడూ లేని విధంగా వైకాపా ప్రభుత్వంలో గడపగడపకు రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నో తరాలుగా కాలనీలో నివసిస్తున్నారు దళితులకు స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చొరవతో నిరుపేదలకు సిమెంటు రేకులు పంపిణీ చేసిన ప్రభుత్వం వైకాపా అన్నారు. ఈ ఐదేళ్లలో ప్రభుత్వం అందించిన లబ్దిని వాలంటీర్ ప్రశాంత్ తో కలిసి లబ్ధిదారులకు ఆమె వివరించారు. ఇటువంటి ప్రజా రంజక ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ తమ మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.