. మోడీ ఓటమి తోనే దేశానికి భవిష్యత్తు
. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ నాగభూషణం
విశాలాంధ్ర : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాజాం నియోజకవర్గ కార్యవర్గ సమావేశం స్థానిక సిపిఐ ఆఫీసులో నిర్వహించుకోవడం. అనంతరం మీడియా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ .నాగభూషణం నియోజకవర్గ కార్యదర్శి ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మతోన్మాద బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలకు, వైసీపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ,సిపిఎం, కాంగ్రెస్ తదితర పార్టీలకు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటాలు చేసిందని. రాబోయే ఎన్నికల్లో సిపిఐ పోటీ చేసే స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు కేంద్రం పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణాలకు నిధులు మంజూరు చేయకుండా మోసగించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ , విభజన హామీలను గాలికి వదిలేసి ఆంధ్ర ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు రాజం నియోజకవర్గం లో ఎటువంటి ఒక్క అభివృద్ధి పని కూడా నోచుకోకుండా పట్టణంలో రోడ్లు వేయమని సిపిఐగా పలుమార్లు ప్రజా అధికారుల దగ్గర దృష్టికి తీసుకువెళ్లిన కనీస స్పందించకపోవడం నియోజవర్గ ప్రజలను మోసం చేయడమేనని అన్నారు వచ్చే స్థానిక ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పి ఇండియా కూటమి మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శులు ఎస్ .కనకరాజు వై. కృష్ణ ఏఐఎస్ఎఫ్ నాయకులు బి.దుర్గ తదితరులు పాల్గొన్నారు…