ఎంపీపీ శ్రీలక్ష్మి
విశాలాంధ్ర – ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): రహదారుల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అన్నారు. శుక్రవారం గోపీనాథపట్నం గ్రామంలో రూ.3 లక్షలు ఉపాధి హామీ నిధులతో సి సి రోడ్డు పనులకు ఎంపీపీ శ్రీలక్ష్మి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుత్సకాయల విష్ణుమూర్తి, గంటా లక్ష్మణరావు,నార్పిన త్రిమూర్తులు, వార్డ్ మెంబర్ బాపనయ్య, ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.