Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కలవల మురళీధర్…
విశాలాంధ్ర -ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని,, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కలవల మురళీధర్, వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు రూపా రాగిణి పేర్కొన్నారు.. ఈ సందర్భంగా పట్టణంలోని కే పి టి వీధిలోని వాసవి దేవాలయం నుండి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి, కాలేజీ సర్కిల్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి 123వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రకు రాష్ట్ర హోదా తెచ్చిపెట్టిన భారతీయ వీరుడు అని మద్రాస్ రాష్ట్రము నుండి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు 56 రోజులు పూను కోవడం జరిగిందని తెలిపారు. పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీకి బలమైన భక్తుడు అని, ఆయన జీవితాంతం సత్యం, అహింస, దేశభక్తి, హరిజనుల అభ్యున్నత కోసం ఉద్యమించడం జరిగిందని తెలిపారు. పొట్టి శ్రీరాములు మరణించిన తర్వాత భారత ప్రధాని నెహ్రూ కొత్తగా స్వతంత్ర దేశం ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడుతుందని వారు అధికారికంగా ప్రకటించారు. పొట్టి శ్రీరాములు తమిళనాడు పరిపాల నుండి స్వతంత్రంగా తెలుగు మాట్లాడే రాష్ట్రాన్ని స్థాపించడానికి తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన బృందం ప్రెసిడెంట్ గోపా చంద్ర, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img