గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లోని ప్రధాన శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 123వ జయంతి వేడుకలను పాఠకులు, సిబ్బంది నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణం అని తెలిపారు. అలాగే దళితులకు ఆలయ ప్రవేశం కోసం ఎంతో కృషి చేయడం జరిగిందని తెలిపారు. తెలుగు ప్రజల మేలు కోసం ప్రాణ త్యాగం చేసిన మహాత్ముడు అని వారు తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు గుర్తుపెట్టుకుని కృతజ్ఞతతో జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది శివమ్మ, రమణ నాయక్, గంగాధర్, సత్యనారాయణ, పాఠకులు పాల్గొన్నారు.